Home Special Stories బెంగాల్ కొత్త బాస్ ‘సువేందు’.. కౌన్సిలర్ నుండి ముఖ్యమంత్రి వరకు! – Suvendu Adhikari Biography

బెంగాల్ కొత్త బాస్ ‘సువేందు’.. కౌన్సిలర్ నుండి ముఖ్యమంత్రి వరకు! – Suvendu Adhikari Biography

0
47
Suvendu Adhikari Biography
Spread the love
  • నందిగ్రామ్ వీరుడు.. మమతపై ‘జయం’ కొట్టిన ధీరుడు
  • తండ్రి అడుగుజాడల్లో రాజకీయ ప్రవేశం.. తిరుగులేని నేతగా ఎదిగిన తీరు
  • టీఎంసీలో నంబర్-2 నుండి బీజేపీ సీఎం అభ్యర్థి వరకు సువేందు రాజకీయ ప్రస్థానం

Suvendu Adhikari Biography | పశ్చిమ బెంగాల్ రాజకీయ యవనికపై ఒక కొత్త శకం మొదలైంది. ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా, తృణమూల్ కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న సువేందు అధికారి.. నేడు అదే మమతను ఓడించి బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. 1970 డిసెంబరు 15న తూర్పు మేదినీపుర్‌లోని కర్కులీలో జన్మించిన సువేందుది పక్కా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం.

రాజకీయ అరంగేట్రం – నందిగ్రామ్ ఉద్యమం

సువేందు తండ్రి సిసిర్ అధికారి కేంద్ర మంత్రిగా, ఎంపీగా పనిచేశారు. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన సువేందు, 1995లో తొలిసారి కాంగ్రెస్ నుండి కౌన్సిలర్‌గా గెలిచి తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1998లో తండ్రితో కలిసి టీఎంసీలో చేరిన ఆయన, 2006లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, సువేందును రాష్ట్రస్థాయి నేతగా నిలబెట్టింది మాత్రం 2007 నాటి నందిగ్రామ్ ఉద్యమం. వామపక్ష ప్రభుత్వం చేపట్టిన సెజ్ (SEZ) ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని ముందుండి నడిపించి, మమతకు అత్యంత నమ్మకస్తుడిగా మారారు.

జాతీయ రాజకీయాల నుండి రాష్ట్ర మంత్రి వరకు

2009లో తమ్లుక్ లోక్‌సభ స్థానం నుండి ఎంపీగా గెలిచి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన సువేందు, 2016లో తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి నందిగ్రామ్ ఎమ్మెల్యేగా గెలిచి మమత సర్కారులో మంత్రి పదవి చేపట్టారు. ఒకానొక సమయంలో టీఎంసీలో మమత తర్వాత నంబర్-2 నాయకుడిగా వెలిగిపోయారు.

బీజేపీలోకి ఎందుకు వెళ్లారు?

టీఎంసీలో సువేందు ప్రభావం పెరుగుతున్న తరుణంలో, మమత తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి ప్రాధాన్యత ఇవ్వడం సువేందుకు రుచించలేదు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గళమెత్తిన ఆయన, 2020 చివర్లో ఊహించని విధంగా టీఎంసీని వీడి బీజేపీలో చేరారు.

మమతపై వరుస విజయాలు.. ఇప్పుడు సీఎం!

2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ వేదికగా మమతా బెనర్జీని ఓడించి దేశం దృష్టిని ఆకర్షించిన సువేందు, అప్పటి నుండి అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటూ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేశారు. తాజా ఎన్నికల్లో భవానీపుర్‌లో మమతను మరోసారి ఓడించి, బెంగాల్ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమయ్యారు. ఒక సాధారణ కౌన్సిలర్‌గా మొదలైన ఆయన ప్రస్థానం నేడు ముఖ్యమంత్రి స్థాయికి చేరడం భారత రాజకీయాల్లో ఒక అరుదైన విజయగాథ.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here